Madhya Pradesh: ప్రతీ క్రైమ్ వెనుక ఒక మోటివ్ ఉంటుంది. ఒక క్రైమ్ జరగడం వల్ల.. అది ఇంకొక క్రైమ్కు దారితీసే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే కొన్ని క్రైమ్స్ వెనుక మోటివ్ చూస్తే.. బాధితుడికి సరైన గుణపాఠం జరిగిందనే అనిపిస్తుంటుంది. కానీ కారణం ఏదైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు. అయితే అది మర్చిపోయిన ఓ తండ్రి.. తన కూతురి జరిగిన అన్యాయానికి తట్టుకోలేక హత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో జరిగిన ఈ ఘటన లోకల్గా సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నదిలో ఓ మనిషి శరీర భాగాలు తేలుతూ కనిపించాయి. దీంతో అక్కడి స్థానికులు వాటిని ఫోటోలు తీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఫోటోలు ఆ చుట్టుపక్కల వైరల్ కూడా అయ్యాయి. దీంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు. ముందుగా ఆ మృతదేహం ఎవరిదో కనిపెట్టే పనిలో పడ్డారు. ఆ తర్వాత అది సక్తాపూర్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల త్రిలోక్చంద్గా గుర్తించారు.
Also Read: https://www.sirimalli.com/fans-are-expecting-adipurush-first-look-on-this-date/
త్రిలోక్చంద్ గురించి విచారణ జరపగా.. అతడు ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించాడన్న విషయం బయటపడింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేయగా.. ఆ బాలిక తండ్రి, మామ ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. ముందుగా వారు త్రిలోక్చంద్ను బైక్పై అజ్నాల్ నది దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తల నరికి హత్య చేశారు. ఆపై శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేసి నదిలోకి విసిరేశారు.