Huzurabad By Poll : టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఎన్నికలు(Huzurabad By Poll) ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఎన్నికలను అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తుంది. నువ్వా నేనా అంటూ ప్రచారం చేస్తున్నాయి. హుజూరాబాద్లో ఉపఎన్నిక ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ నేతలు.. కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తున్నారు.
అయితే ఆ జోష్ ఇప్పుడు అటు టీఆర్ఎస్, బీజేపీ మెయిన్ లీడర్లలో తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఈటెల రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఎన్నికల పైన టీఆర్ఎస్ భారీ కసరత్తులు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తోపుతోపు లీడర్లు కూడా అక్కడ మాకాం వేశారు.
అటు బీజేపీ కూడా రాష్ట్ర అధ్యక్ష్దుడు నుంచి మిగిలిన నాయకులు కూడా అక్కడ పాగా వేశారు.కానీ ఇప్పుడు ఉపఎన్నిక వాయిదా పడడంతో అంత సైలెంట్ అయిపోయారు. దీనితో ఎన్నికల హీట్ కూడా తగ్గిపోయింది. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీష్ రావు, బీజేపీ నుంచి ఈటెల మాత్రమే ప్రచారానికి పరిమితమయ్యారు. అయితే దీనివెనుక కారణం లేకుండా పోలేదు.
ఉపఎన్నిక ఎప్పుడో తెలియకుండా హడావిడి చేయడం సరికాదని.. దీని వల్ల పార్టీకి పెద్దగా లాభం ఉండదని ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ పార్టీలు భావిస్తున్నట్టుగా సమాచారం. కాగా హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటెల పై పోటీగా బీసీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ ని బరిలోకి దింపుతుంది టీఆర్ఎస్.
Also Read :
- Samantha : సమంత, నాగచైతన్య మధ్యలో శ్రీరెడ్డి..!
- Gold Rates : హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు బంగారం ధరలు ఇలా..!
- Panchangam Today : ఈరోజు ఈ ముహూర్తంలో ఏ పనీ చేయకపోవడమే మంచిది…