Corona Virus : కరోనా బాధితులు.. ఏ స్వీట్ ని తింటే మళ్లీ వాసన, రుచిని వేగంగా పొందవచ్చు?
Corona Virus : ఒక వ్యక్తి ఇమ్యూనిటీ వ్యవస్థ మరీ బలంగా కాకుండా అలాగని బలహీనంగా కాకుండా మధ్య స్థాయిలో ఉంటే మూడు రోజుల యుద్ధంలో ఫలితం తేలదు. ఆ సమరం కొనసాగుతుంది. మూడో రోజు తరువాత వైరస్ ముక్కు నుంచి శరీరం లో ప్రవేశిస్తుంది. వైరస్ (Corona Virus) తన సంఖ్య ను పెంచుకోవడం ప్రారంబిస్తుంది. ఇలాంటి వారికి జలుబు దగ్గు జ్వరం వొళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
జ్వరం, తలనొప్పి, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే అప్పటికి వైరస్ శరీరంలోకి ప్రవేశించి మూడు రోజులు లేదా నాలుగు రోజులు అయినట్టు లెక్క. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జలుబు, తలనొప్పి, జ్వరం లాంటివి ఇతరత్రా కారణాల వల్ల కూడా రావొచ్చు. కానీ కుటుంబంలో ఒకేసారి లేదా ఒకటి రెండో రోజుల్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఇవే లక్షణాలు వస్తే అప్పుడు అది కరోనా అయ్యే అవకాశం ఎక్కువ.
లక్షణాలు కనిపించాక కొంతమంది వెళ్లి టెస్ట్ చేయించుకొంటారు. దాని ఫలితం ఒకటి రెండు రోజుల్లో వస్తుంది. తాము పాజిటివ్ గా తేలిన రోజునుంచి కొంత మంది ఒకటో రోజు రెండో రోజు అని లెక్కించడం మొదలు పెడుతారు. ఇది సరైన పద్దతి కాదు. ఒక వేళ ఒక వ్యక్తి టెస్ట్ రిజల్ట్ ఒక నెల రోజులు ఆలస్యం అయితే అప్పుడు కూడా ఇలా లెక్కిస్తారా? కాదు కదా?
కరోనా లక్షణాలు కన్పించిన రోజు నుంచి ఒకటో రోజు, రెండో రోజు అని లెక్కించాలి. అంటే వైరస్ శరీరంలో ప్రవేశించాక ఒకటి ప్లస్ మూడు అంటే నాలుగో రోజు… రెండో రోజు అంటే రెండు ప్లస్ మూడు అంటే ఐదో రోజు అవుతుంది. అర్థం అయ్యింది కదా? శరీరం లోకి వెళ్లిన వైరస్ అక్కడ glycene ను తినేస్తుంది. glycene దాని ఆహారం. కాని, మన శరీరానికి కూడా glycene కావాలి. మరి దానిని ఎలా పొందాలి?
మన శరీరం లో glycene తగ్గడం వల్ల రుచి, వాసన పోయే అవకాశం వుంది. నేను చూసిన వారిలో మైల్డ్ లక్షణాలు ఉన్న వారిలో అధిక శాతం మందికి ఇలా రుచి, వాసన పొయ్యింది. ఇప్పుడు సెకండ్ లో వేవ్ లో కరోనా లక్షణాలు మారినా ఇలా రుచి, వాసన పోవడం మాత్రం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. మైల్డ్ లక్షణాలు ఉన్న ప్రతి పది మందిలో ఎనిమిది మందికి ఇలా రుచి, వాసన పోవడం చూసాను . కొంత మందికి రెంటిలో ఒకటే పోతుంది . కొంత మందికి రెండూ పోతున్నాయి.
రుచి కన్నా వాసన పోయే వారి సంఖ్య అధికం. లక్షణాలు కనిపించిన ఆరవ లేదా ఏడవ లేదా ఒక్కోసారి ఎనిమిదవ రోజు కూడా ఇలా రుచి వాసన పోవడం జరుగుతోంది. అంటే అప్పటికి వైరస్ వారి శరీరం లో ప్రవేశించి 6 ప్లస్ మూడు అంటే తొమ్మిది రోజులు లేదా పది, పదకొండు రోజులు అయ్యి ఉంటుంది. అప్పటికి వారికి మిగతా రోగ లక్షణాలు ముఖ్యంగా తలనొప్పి, జ్వరం లాంటివి పోయి ఉంటాయి.
ఒక విధంగా చెప్పాలంటే రుచి, వాసన పోవడం అంటే కరోనా నుంచి ఆ వ్యక్తి దాదాపుగా కోలుకున్నారు అని చెప్పడానికి సూచిక. అంటే యుద్ధం దాదాపుగా ముగిసింది. జరిగిన భీకర యుద్ధం లో వైరస్ దాదాపుగా చచ్చింది అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. దగ్గు మాత్రం మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది.
నువ్వుల లడ్డు తినడం ద్వారా మన శరీరానికి తగినంత gylcene అందించవచ్చు. ఇలా చేస్తే పోయిన రుచి వాసన త్వరగా వస్తాయి. పోయిన నాలుగు నుంచి ఆరు రోజుల్లో ఇది తిరిగి వచ్చేస్తుంది . నేను చూసిన వేల మందిలో ఒక్క వ్యక్తికి మాత్రం తిరిగి రావడానికి దాదాపు నెల పట్టింది. అలా ఆలస్యం కావడం వల్ల అతనికి కొత్తగా ఆరోగ్య సమస్యలు రాలేదు.
– వాసిరెడ్డి అమరనాథ్ గారి వాట్సప్ పోస్ట్
Also Read : Corona Rulls :అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!
Also Read :Pawan Kalyan : పవన్ కల్యాణ్ కు కరోనా పాజిటివ్.. అప్పుడప్పుడు ఆక్సిజన్ ను.
Also Read : Sudheer Rashmi : జలజలజలపాతం సాంగ్ లో సుధీర్, రష్మీల కెమిస్ట్రీ అదుర్స్.. తొమ్మిదేళ్ల రిలేషన్ మరి!
Also Read : Nivetha Thomas : నాలో టాలెంట్ ఉంది.. కానీ, వకీల్ సాబ్ వల్ల..
Also Read : Singer Mano Assets : సింగర్ మనో దగ్గర కోట్ల ఆస్తులు.. ఎలా సంపాదించారంటే?
తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి.