Potti Veeraiah : జానపద సినిమాల్లో మాయల మాంత్రికుడికి ఓ చిన్ని చిట్టి పొట్టి సహాయకుడిగా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న పొట్టి వీరయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డారు. పొట్టి వీరయ్య (Potti Veeraiah) అసలు పేరు గట్టు వీరయ్య. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలోని ఫణిగిరి గ్రామం.. ఆయన సొంతూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఆసక్తి.
నిజానికి పొట్టి వీరయ్య జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి హీరో శోభన్ బాబే. ఎందుకంటే.. అప్పట్లో విఠలాచార్య తీసే సినిమాల్లో మాయలు, మంత్రాలు ఉండేవి. అందులో పొట్టి వీరయ్య లాంటివాళ్లకు మాంత్రికుల సహాయకులుగా చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే వాటిని క్యాష్ చేసుకుంటే కెరీర్ బాగుంటుందని అప్పట్లో శోభన్ బాబు ఓ సలహా ఇచ్చారు. దానినే ఫాలో అయ్యారు పొట్టి వీరయ్య. 90 పైసల జీతానికి పనిచేసే పొట్టి వీరయ్యకు సోగ్గాడు ఇచ్చిన సలహా బాగా పనిచేసింది.
సినిమాల కోసం మద్రాసుకు వెళ్లి అక్కడ ఇబ్బందులు పడ్డా.. శోభన్ బాబు చలవతో కెరీర్ లో ముందుకు వెళ్లారు. అలా విఠలాచార్య సినిమా అగ్గివీరుడుతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. విఠలాచార్య తీసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆయన నటించారు. తరువాత దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన తాతామనవడు సినిమాలోనూ నటించారు.
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు ఉన్నా.. పొట్ట వీరయ్యకు ఉన్న క్రేజే వేరు. పెద్ద కమెడియన్స్ తో పోటాపోటీగా పేరు సంపాదించుకున్నారు. హైదరాబాద్ వచ్చాకా చాలా టీవీ షోలలో నటించారు. దాసరి, రాజబాబులు ఎంత ఎంకరేజ్ చేసినా.. ఎందుకే తరువాత ఎక్కువ అవకాశాలు రాలేదు. హైదరాబాద్ లోని కృష్ణానగర్ లో కొంతకాలం పాటు పబ్లిక్ టెలిఫోన్ బూత్ కూడా నడిపేవారు.
పొట్టి వీరయ్యకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో చిన్నమ్మాయి విజయదుర్గ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయన భార్య మల్లిక.. 2008లో చనిపోయారు.
ఇవి కూడా చదవండి :
Also Read : Singer Mohana Bhogaraju: అందంలో హీరోయిన్స్ తో పోటీ.. పాటల్లో ఆమె వాయిస్ అద్భుతః
Also Read : Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన్నా గుండు ఫోటోల వెనుక అసలు కథ ఇది!
Also Read : Nabha Natesh : పసుపుపచ్చ కోకలో కుర్రకారుకు పిచ్చెక్కించే ఫోజులిచ్చిన ఇస్మార్ట్ బ్యూటీ
తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి