Parineeti Chopra: ‘అర్జున్ రెడ్డి’.. ఈ సినిమా టాలీవుడ్లో ఎంత పెద్ద సెన్సేషన్ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు సినిమాలను ఒకే కోణంలో చూసిన ప్రేక్షకులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరో కోణాన్ని పరిచయం చేశాడు. అప్పటినుండి దర్శకుడు సందీప్తో సినిమా చేయాలని, హీరో విజయ్ దేవరకొండ సరసన నటించాలని చాలామంది హీరోయిన్లు ఆశపడుతున్నారు. కానీ ఓ బాలీవుడ్ భామ మాత్రం చేతివరకు వచ్చిన ఆఫర్ను కూడా కాదనుకుంది.
ఒక్క సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్లో ఒక సెన్సేషన్ అయిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాను చాలా ఇష్టపడిన షాహిద్ కపూర్.. సందీప్తో ఈ మూవీని హిందీలో రీమేక్ చేయించాడు. అదే ‘కబీర్ సింగ్’. కబీర్ సింగ్ చిత్రంతో షాహిద్ కెరీర్లో ఎప్పుడూ లేనంత బిగ్గెస్ట్ హిట్ను అందుకున్నాడు. దీంతో సందీప్ వంగా బాలీవుడ్కు కూడా మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. అందుకే రణభీర్ కపూర్లాంటి యంగ్ టాలెంట్తో ‘యానిమల్’ అనే చిత్రాన్ని ప్లాన్ చేశాడు.
Animal Movie Glimpse: https://youtu.be/lvPlBJk2oto
ప్రస్తుతం రణభీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ అనే మైథలాజికల్ సినిమాలో నటిస్తున్నాడు. కోవిడ్ కంటే ముందు ప్రారంభమయిన ఈ చిత్ర షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కువ గ్రాఫిక్ వర్క్తో, భారీ క్యాస్టింగ్తో, భారీ బడ్జెట్తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తి కాకముందే సందీప్ వంగాతో ‘యానిమల్’ చేయడానికి సైన్ చేశాడు రణభీర్.
రణభీర్, సందీప్ వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న యానిమల్లో హీరోయిన్గా పరిణీతి చోప్రాను ఫైనల్ చేశారు. కానీ అదే సమయానికి తనకు మరో మూవీ ఆఫర్ రావడంతో పరిణీతి.. యానిమల్ను పక్కన పెట్టేసినట్టు టాక్. పరిణీతికి ఎప్పటినుండో ఇమ్తియాజ్ అలీ దర్శకత్వంలో నటించాలని కోరిక ఉంది. అయితే ఈ దర్శకుడు తెరకెక్కించనున్న తరువాతి చిత్రం ‘చంకీలా’లో పరిణీతికి ఆఫర్ వచ్చిందట. దానికోసమే యానిమల్ను కాదనుకుని చంకీలాను ఎంచుకుందట పరిణీతి చోప్రా.