కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది.రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. మే 1 వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంది.