Mega Brothers : మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్(Mega Brothers) పోటీపడి మరీ రీమేక్ లు చేస్తున్నారు. పవన్ ఫస్ట్ నుంచి రీమేక్ లకే ఓటు వేస్తుంటే.. ఇప్పుడు తమ్ముడి రూట్ లోనే అన్నయ్య కూడా వెళ్తున్నారు. ఇద్దరూ రీమేక్ లతోనే రీ ఎంట్రీ ఇచ్చి ఒరిజినల్ కథలను పక్కనపెట్టి ఇప్పుడు వరుస రీమేక్ లకి పచ్చాజెండా ఊపేస్తున్నారు.
చిరంజీవి ఆచార్య తర్వాత తమిళ్ మూవీ వేదాళం సినిమాని తెలుగులో భోలాశంకర్ గా రీమేక్ చేస్తున్నారు. ఇక మలయాళం మూవీ లూసిఫర్ రీమేక్ ని గాడ్ ఫాదర్ గా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా ప్రభుదేవా దర్శకత్వంలో ఓ హిందీ మూవీని రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ప్రభుదేవాకి కూడా మంచి రీమేక్ స్పెషలిస్ట్ గా పేరుంది.
అటు పవన్ వకీల్ సాబ్ రీమేక్ తో వచ్చి మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు భీమ్లా నాయక్ పేరుతో ఓ మలయాళ సినిమాకి రీమేక్ చేస్తున్నాడు. ఆ తరవాత రం తాళ్లూరి నిర్మాణంలో ఓ రీమేక్ కి ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ కుదిరితే ఈ రీమేక్ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇలా అన్నదమ్ములిద్దరూ రీమేక్ లపై మనసు పారేసుకుంటున్నారు.
ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న చిరు, పవన్ లే ఇలా రీమేక్ లు చేస్తే కొత్త కథలు, కొత్త దర్శకులు ఎలా పుట్టుకొస్తారు అన్నది సినీ విశ్లేషకుల మాట.
Also Read :