వకీల్ సాబ్ కి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీలో బెనిఫిట్ షోలకి, స్పెషల్ షోలకి అనుమతి ఇవ్వలేదు.. వీటికితోడుగా టికెట్ రేట్లను పెంచి అమ్మొద్దని చెప్పింది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ల వద్ద దాడికి దిగుతున్నారు. తిరుపతిలోని శాంతి థియేటర్ వద్ద రాళ్లతో దాడికి దిగారు. అయితే తెలంగాణలో మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. బెనిఫిట్ షోలకి, స్పెషల్ షో లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఒక్కో టికెట్ ధర 1500 పైగా పలుకుతుంది. కాగా సోషల్ మీడియాలో వస్తున్న రివ్యూల ప్రకారం సినిమా సూపర్ డూపర్ హిట్టని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ తో పాటుగా ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య నటించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు సినిమాని నిర్మించగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. థమన్ సంగీతం అందించారు.